అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. ఒక కథానాయికగా రకుల్ .. మరో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.
నాగ్ రోల్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఆయనకి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. అయితే ఈ టీజర్లో రకుల్ కనిపించకపోవడంపై అందరిలో సందేహాలు తలెత్తాయి. దాంతో రకుల్ పాత్రకి సంబంధించిన సన్నివేశాలపై ప్రత్యేకంగా మరో టీజర్ ను వదులుతామనీ, అందువల్లనే తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో రకుల్ ను చూపించలేదని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు.
మన్మథుడు చిత్రానికి 17 ఏళ్ల తరువాత ఈ చిత్రం సీక్వెల్గా రాబోతుంది. స్టిల్ వర్జిన్, ప్లే బాయ్గా డిఫరెంట్ షేడ్స్తో ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించారు.