టాలీవుడ్‌లో ఇటీవల ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు ఒకే రోజు విడుదల చేసేందుకు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తే ఆ ప్రభావం ఆయా సినిమాల‌ ఓపెనింగ్ పై కచ్చితంగా ఉంటుందని భావించి... ఆయా చిత్రాల నిర్మాతలు ఒక అండర్ స్టాండింగ్‌తో సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జూలై 12 న టాలీవుడ్ లో యంగ్ హీరోల మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పేలా లేదు.  సందీప్ కిషన్ తొలిసారి నిర్మాతగా మారి చేసిన నిను వీడని నీడను నేనే సినిమా జూలై 12న రిలీజ్ అవుతోంది.


అదే రోజు పూరి జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ కూడా వస్తోంది. గతంలో తనకు హిట్ ఇచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పేరుమీద వెంకటాద్రి ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో ఈ సినిమాను నిర్మించాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా కోసం కోన వెంకట్ అన్న అయిన‌ గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి కుమార్తె, సినీ స్టైలిస్ట్ కోన నీర‌జ‌ ఒక పాట కూడా రాశారు. అది టైటిల్ సాంగ్ కావడం విశేషం.


రొమాంటిక్ లవ్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిను వీడని నీడను నేనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో సందీప్ సరసన అన‌న్య‌ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక గత కొద్ది సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో ఉన్న పూరి జగన్నాథ్, హీరో నితిన్ ఇస్మార్ట్‌ శంకర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఫలితంతోనే ఈ ఇద్దరి ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఏదేమైనా అటు సందీప్ కిషన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో హిట్ అత్యంత అవసరం. ఈ టైంలో వీరు ఒకే రోజు బాక్సాపీస్ వద్ద యుద్ధానికి రెడీ అవుతుండటం ఆసక్తికరంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: