పటాస్ యాంకర్ శ్రీముఖి తన యాంకరింగ్ టాలెంట్ తో ఎంతోమంది ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఏర్పరచుకుంది. ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ట్రై చేసిన శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. పటాస్ షోలో యాంకర్ రవితో శ్రీముఖి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈమధ్యనే పటాస్ షోకి బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపింది శ్రీముఖి.


ఆ షోకి బ్రేక్ ఇవ్వడానికి శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్ గా వెళ్లడమే కారణమని అంటున్నారు. ఇక ఈమధ్య తరచు తన ఫాలోవర్స్ తో చాట్ చేస్తున్న శ్రీముఖి తనకు సంబందించిన విషయాలను వెళ్లడించడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అందులో భాగంగానే ఓ శ్రీముఖి అభిమాని మీరు మందు కొడతారా అని ప్రశ్నించగా లేదని చెప్పను కాని అకేషనల్ గా అంటూ సమాధానం ఇచ్చింది.


అంతేకాదు వైన్ తాగుతానని.. అది ఆరోగ్యానికి మంచిదని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అవును నేను మందు కొడతా అని శ్రీముఖి అంత డేర్ గా ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తన చలాకీతనంతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించే శ్రీముఖి తన తోటి యాంకర్స్ గురించి చాటింగ్ లో ప్రస్థావించింది.


రష్మి స్ట్రైట్ ఫార్వర్డ్ గల పర్సన్ అని.. అనసూయ ఫ్యామిలీ ఉమెన్ అని.. హైపర్ ఆది వెరీ టాలెంటెడ్ అని చెప్పుకొచ్చింది. యాంకర్ రవితో గొడవ వల్లే శ్రీముఖి పటాస్ నుండి బయటకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయిఏ ఆ వార్తలపై మాత్రం శ్రీముఖి స్పందించ లేదు. తెలుగులో ఉన్న యాంకర్స్ అందరిలో సత్తా చాటుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంది శ్రీముఖి.



మరింత సమాచారం తెలుసుకోండి: