తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో విక్రమ్ అంటే ప్రత్యేక ఇమేజ్ ఉంది.  గతంలో విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన ప్రయోగాలు చియాన్ విక్రమ్ చేశాడు.  ఆయన నటించిన ‘ఐ’మూవీనే ఇందుకు నిదర్శనం.  అయితే ఇప్పుడు హీరోల తనయులు హీరోలుగా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వస్తున్నాడు.  


తెలుగు లో సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో షాహిత్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’రిమేక్ గా వస్తుంది.  తమిళ్ లో బాలా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి రిమేక్ వచ్చింది..కానీ ఈ సినిమా మద్యలోనే ఆగిపోయింది.  కొత్త దర్శకుడు గిరిసాయ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఆదిత్య వర్మ పేరుతో ఈ చిత్రం తమిళంలో తెరక్కుతోంది. 


యంగ్ బ్యూటీ బనిత సందు హీరోయిన్ గా నటిస్తోంది.ధృవ్ స్టైలిష్ గా కనిపిస్తూనే పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఈ మూవీ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్మురేపుతుంది.  కథలో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించడం లేదు. 4కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: