ఇద్దరు ఒకే పరిశ్రమలో ఉంటున్న ఇద్దరు స్టార్స్ మధ్య 16 ఏళ్లుగా మాటలు లేవంటే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఏ పరిశ్రమకు చెందిన స్టార్స్ 16 ఏళ్లుగా మాట్లాడుకోలేదంటే ఇంకెక్కడ బాలీవుడ్ లోనే ఇలా జరిగింది అంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సన్ని డియోల్ ఇద్దరు ఎదురుపడి 16 ఏళ్లు అయ్యిందట.  


ఇద్దరు కలిసి నటించిన డర్ సినిమా టైంలో గొడవ అయ్యిందట. యశ్ చోప్రా నిర్మించిన ఆ సినిమాలో తాను ఆర్మీ మేనేజర్ గా నటించగా షారుఖ్ ఓ సాధారణ యువకుడిగా నటించాడు. అయితే ఆ సినిమాలో ఓ కుర్రాడు ఆర్మీ మేజర్ ను ఎలా పొడుస్తాడని సన్ని డియోల్ వాదించాడట. అయితే షారుఖ్, యశ్ చోప్రా ఇద్దరు తన మాట వినలేదట.


అందుకే ఆ ఒక్క సినిమా చేసి ఆ తర్వాత యశ్ చోప్రా సినిమాలు చేయలేదని. షారుఖ్ తో అప్పుడు గొడవ వల్ల 16 ఏళ్లు మాట్లాడలేదని అన్నారు సన్ని డియోల్. అయితే తాను ఎక్కువ బయట ఫంక్షన్స్ కు రాను కాబట్టి షారుఖ్ ఎదురుపడలేదని అందుకే అతనితో మాట్లాడే అవకాశం రాలేదని చెప్పారు సన్ని డియోల్.


రీసెంట్ ఎలక్షన్స్ లో ఎంపిగా గెలిచిన సన్ని డియోల్ నేషనల్ ఛానెల్ ఇంటర్వ్యూలో సిని, పొలిటికల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఒకే పరిశ్రమలో ఉండి ఇలా ఇద్దరు స్టార్స్ ఇన్నేళ్లు మాట్లాడకుండా ఉండటం అనేది మాత్రం షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రాస్తుతం షారుఖ్ ఖాన్ కెరియర్ కూడా చాలా దారుణంగా మారింది. ఏ సినిమా చేసినా సరే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: