డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకోవడం లో కొత్తదనాన్ని కోరుకోవడంలో ముందుంటాడు దగ్గుబాటి రానా. కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతూ విభిన్నమైన పాత్రలు వేస్తూ భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాడు. ఈ గ్రామంలో ప్రస్తుతం నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు రానా. డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు.


ఈ సినిమాలో రానా పక్కన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యింది. ప్రస్తుతం దర్శకుడు సాయి పల్లవికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ‘విరాటపర్వం’ కథ లీకైందంటూ వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడట.


అడవుల్లోకి వెళ్లి రానాని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రానా సమాజంలోకి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తాడట. రానా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఇందులో ఆసక్తికర అంశం. దీనితో దర్శకుడు నక్సలిజాన్ని, రాజకీయాలని మిళితం చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: