ట్రెండ్ ఫాలో అవడం కాదు సెట్ చేయాలి. మరి ఓంకార్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడో లేక సెట్ చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. బుల్లి తెరపై యాంకర్‌గా తనదైన ముద్ర వేసిన ఓంకార్ దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదటిసారి దర్శకత్వం వహించిన రాజుగారి గది సినిమాతో సక్సెస్ ను దక్కించుకున్న ఓంకార్ ఆ తర్వాత అదే జోనర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నాగార్జున ప్రధాన పాత్రలో 'రాజుగారి గది 2' సినిమాని డైరెక్ట్ చేశాడు. సమంత కూడా నటించిన ఈ సినిమా   పై  అంచనాలు భారీగా వచ్చాయి. అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. రాజుగారి గది 2 ఫ్లాప్ అవ్వడంతో ఆ సిరీస్ ను ఓంకార్ వదిలేస్తాడేమో అని అందరు అనుకున్నారు. కానీ రాజు గారి గది 3ని రీసెంట్ గా ప్రారంభించి అందరికి చిన్న షాకిచాడు ఓంకార్.


రెండవ పార్ట్ లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ ఉన్నా కూడా ఆకట్టుకోలేక పోయిన ఓంకార్ ఈసారి తమ్ముడు అశ్విన్ తో మూడవ పార్ట్ కు సిద్దం అయ్యాడు. హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసుకున్నాడు. అయితే హర్రర్ సినిమాలు వరుసగా చేసి ఫ్లాప్ అయిన తమన్నాను ఈ సినిమాకు తీసుకోవడం ఇండస్ట్రీలో అందరికి ఆశ్చర్యంగా ఉంది. అభినేత్రి సినిమాతో పర్వాలేదు అనిపించినా అభినేత్రి 2 తో మాత్రం తమన్నా ఆకట్టుకోలేదు. హర్రర్ పాత్రను సరిగ్గ పోషించలేకపోయింది.  


అశ్విన్, తమన్నా పెద్దగా క్రేజ్ లేని స్టార్స్ తో ఈసారి రాజు గారి గదిని తీస్తున్న ఓంకార్ తప్పకుండా సక్సెస్ దక్కించుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాలో స్టార్స్ లేరు కాబట్టి కనీసం కంటేంటన్నా చాలా బలంగా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి పార్ట్ లో ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉండటంతో సినిమా మాస్ ఆడియన్స్ కు నచ్చింది. రాజు గారి గది 3 చాలా విభిన్నంగా వినూత్నంగా ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఓంకార్ ఈ సినిమాతో ట్రెండ్ ఫాలో అవుతాడో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: