టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు తన కెమెరా పనితనంతో అద్భుతాలు సృష్టించిన చోటా కే నాయుడు అంటే  తెలియని వారు ఉండారు.  గతంలో ఎన్నడూ చోటా కే నాయుడు వార్తల్లో రాలేదు..ఈ మద్య కొన్ని కాంట్రవర్సీ వార్తలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ మద్య ‘కవచం’సినిమా ఆడియో వేడుకలో హీరోయిన్ కాజల్ ని పబ్లిక్ గా ముద్దు పెట్టుకొని షాక్ ఇచ్చాడు.  అయితే అప్పటికే షాక్ తిన్న కాజల్ ఈ విషయంపై రచ్చ అవుతుందని గ్రహించి  హుందాగా ప్రవర్తించినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ఊరుకోలేదు. తన ఉద్దేశాన్ని తప్పుగా చూపించారని..కాజల్ అంటే తనకు ఎంతో గౌరవం అని చోటా ఎంత క్లారిటీ ఇచ్చినా..ఆరోపణలు మాత్రం వెల్లువెత్తాయి. 

ఈ రగడ కొంత కాలం నడిచింది.. అప్పటి ఏ వేడుకలకు హాజరైనా చాలా జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టారు.  కానీ మరోసారి సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అయ్యాడు.  ఇటీవల జరిగిన 'రాజు గారి గది3' సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఛోటా.. తమన్నాతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.  ఈ కార్యక్రమంలో అప్పటి వరకు దూరంగా ఉన్న చోటా ఒక్కసారే తమన్నా పక్కనజేరి ఆమె చేతిని పట్టుకున్నాడు.. తమన్నా తన చేతిని విడిపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా.. ఆయన గట్టిగా అలానే పట్టుకోవడం వీడియోలో కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. పబ్లిక్ లో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. ఛోటా ఇలానే గనుక కంటిన్యూ అయితే ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: