ఒకప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోల హవా నడుస్తున్న సమయంలో వారికి సమానంగా సినిమాల్లో నటిస్తూ, పారితోషికం అందుకుని నటిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అందిరోహించారు సీనియర్ నటి విజయశాంతి. కృష్ణ, శోభన్ బాబు మొదలుకొని అప్పట్లోనే దాదాపుగా అందరు హీరోల సరసన హీరోయిన్ గా నటించిన విజయశాంతి, 2006 తరువాత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె, 

ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు. అయితే చాలారోజుల నుండి మంచి సినిమా అవకాశం దొరికితే మళ్ళి సినిమాల్లోకి రావాలని భావించిన విజయశాంతికి, ఇటీవల సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడిల కలయికలో రాబోయే సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా కథ మరియి అందులోని తన పాత్ర నచ్చడంతో, ఆ సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమాలో ఆమె పాత్ర ఎటువంటిది అనేది మాత్రం తెలియరాలేదు. ఇకపోతే ఈరోజు విజయశాంతి పుట్టినరోజు కావడంతో పలువురు సినిమా ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. 

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా దర్శకనిర్మాతలతో పాటు కాసేపటి క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి, మంచి విజయాన్ని అందుకుని సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగించాలని కోరుకుంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: