అసలే బాలీవుడ్ సినిమాల ఫలితాలు ఈమధ్య ఆశించిన స్థాయిలో లేదనుకుంటుంటే అక్కడ తెలుగు సినిమాల హవా కొనసాగించడం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి వెళ్లిందని చెప్పాలి.  


తెలుగులో ఈమధ్య ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. అందుకే బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను టాలీవుడ్ పై పడ్డది. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను అక్కడకు తీసుకెళ్తున్నారు. ఇక తాము ఎలాంటి సినిమా తీసినా చెల్లుతుందనుకున్న ఖాన్ ల పరిస్థితి ఇప్పుడు ఏమి బాగాలేదు. ఒక్క సల్మాన్ ఖాన్ తప్ప షారుఖ్, ఆమీర్ ఖాన్ ల పరిస్థితి ఏమి బాగాలేదు. 


తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను హిందిలో రీమేక్ చేశారు. సందీప్ వంగ డైరక్షన్ లో షాహిద్ కపూర్, కియరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాపై ముంబై మీడియా నెగటివ్ ప్రచారం చేస్తున్నా వాటికి ఏమాత్రం సంబంధం లేకుండా వసూళ్లు ఉన్నాయి.


మిగతా సిని పరిశ్రమలతో పోల్చుకుంటే ఈమధ్య తెలుగు సినిమాల యావరేజ్ హిట్ కౌంట్ పెరిగిందని చెప్పొచ్చు. ఓ పక్క కోలీవుడ్ లో కూడా పరిస్థితి అంత బాగాలేదు. కన్నడ, మళయాళ సినిమాలు అలానే ఉన్నాయి. బాలీవుడ్ లో మాత్రం స్టార్స్ అంతా సైలెంట్ అయ్యారని చెప్పొచ్చు.      



మరింత సమాచారం తెలుసుకోండి: