స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం ఏజెంట్ సాయి "శ్రీనివాస్ ఆత్రేయ". స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ నెల 21న విడుదలై ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ కోవలోనే క్రెజీ  హీరో విజయ దేవరకొండ తో పాటు హీరో అడవిశేషు, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ తదితర సెలెబ్రిటీ లు  సోమవారం సాయంత్రం ఏ ఎమ్ బి సినిమాస్ లో  ఈ సినిమాను చూసి తమ స్పందన  తెలియచేయడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందులో మొదటగా


 విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..  ఆరేళ్లకు పైగా ఈ చిత్ర హీరో నవీన్ నాకు బాగా తెలుసు. థియేటర్ లో వర్క్ షాప్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కలసి పనిచేసాము. మళ్లీ ఇప్పుడు ఇలా నవీన్ హీరో అయ్యాక 
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా కు కలిసాం చాలా హ్యాపీగా ఉంది. సినిమా నాకు బాగా నచ్చింది. టెక్నీకల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. స్వరూప్ డైరెక్షన్ అదిరిపోయింది. మ్యూజిక్ అండ్ ఆర్ ఆర్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకు   నవీన్ నటన పెద్ద అస్సెట్. నా నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఇదే స్పందన రావడం చూసి సంతోషంగా ఉంది. అలానే  నా ఫ్రెండ్ ఇలా సక్సెస్ అయ్యాడని గర్వంగా కూడా ఉంది. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా నవీన్ నటనకు ఐ రియల్లీ లవ్డ్. ఇండస్ట్రీలో నవీన్ లాంటి వాడు లేడు అని చెప్పగలను. ఇంకో కొత్త సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవీన్. మరిన్ని మంచి  సినిమాలు చేస్తూ   విజయం సాధించాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. 
 
అడవిశేషు మాట్లాడుతూ.. ఇప్పుడే సినిమా చూసాము.. చాలా బాగా నచ్చింది నాకు. మొదటి నుంచి నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా అదే తరహా కనుక ఇంకా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఆర్ ఆర్ కు అయితే నేను హమ్ చేయడం మొదలు పెట్టా.. అంతగా కనెక్ట్ అయ్యా నేను. మొదట ఎగ్జైట్ మెంట్ తో సినిమా చూడడానికి వచ్చా.. నా ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అయ్యింది ఈ సినిమా. సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ నవీన్. ఓ మంచి సినిమాను ప్రెసెంట్ చేశారు. ఇలాంటి సినిమాకు తప్పకుండా మరింత సపోర్ట్  అందించాలని కోరుతున్నా అన్నారు. 
దర్శకుడు స్వరూప్  మాట్లాడుతూ... మేము మొదట బయపడ్డాము.. కానీ మా సినిమాను చూసిన వారందరూ బాగుందని చెప్పడమే కాకుండా మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం అని ట్యాగ్ లైన్ కూడా ఇస్తుండటంతో హ్యాపీ గా ఉన్నాము. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ల వయసు పెద్ద వారు కూడా నేను ఎక్కడ కనపడితే అక్కడ మంచి సినిమా తీసారంటూ మెచ్చుకుంటున్నారు. సూపర్ హిట్ మూవీ ఇచ్చిన ఆడియన్స్ కు నా ధన్యవాదాలు అని చెప్పారు.
   
నిర్మాత రాహుల్ మాట్లాడుతూ... 
డిటెక్టీవ్ జోనర్ లు ఉన్న సినిమాలు  ఈ మధ్య రావడం లేదు వచ్చినా ప్రేక్షకులు చూడటం లేదు అలాంటి తరుణంలో మా సినిమాను చూస్తారా అని మొదట భయపడ్డాను కానీ మా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ విడుదల తరువాత ఆ భయం, ఆలోచన రెండూ పోయాయి. హానెస్ట్ ఫిల్మ్ తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. మొదటి నుంచీ మా సినిమాపై మాకు ఉన్న నమ్మకమే నిజమయ్యిందని చెప్పారు. 
 
 హీరో నవీన్ మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం విడుదలైంది  ఈ చిత్రం. మొదట్లో బయపడ్డాము. కానీ మొదటి షో రిజల్ట్ తరువాత ఆ భయం పోయి సంతోష పడ్డాము. రెండేళ్లుగా ఉద్యోగం మానేసి మరీ  ఈ  ప్రాజెక్ట్ కోసం మేమందరం కష్టపడ్డాము. ఇప్పుడీ హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే మా కష్టం మరచిపోయాము. హైదరాబాద్ లో 60 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తోంది.. ఈ మా సినిమాను చూసి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అడవి శేషులకు నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: