హైదరాబాద్లో ఇటీవల మిస్సింగ్ల కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇంటి నుంచి అమ్మాయిలు బయటకు వెళితే ఏం జరుగుతుందో ? అన్న ఆందోళనలు తల్లిదండ్రులకు ఎక్కువ అవుతున్నాయి. ఈ మిస్సింగ్లు ఇలా ఉంటే తాజాగా ఈ మహానగరంలో ఓ టీవీ నటి మిస్ అయిన వార్త సంచలనంగా మారింది. వారం రోజుల క్రితం అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటోన్న టీవీ నటి లలిత మిస్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
అనంతపురం జిల్లాలోని ధర్మవరంకు చెందిన లలిత హైదరాబాద్ వచ్చి బుల్లితెర నటిగా చేస్తోంది. ఆమె నటించిన పలు సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చిందట. ఆమె ఆచూకీ కోసం అనేక విధాలుగా ప్రయత్నించిన వారు చివరకు హైదరాబాద్ వచ్చి ఆరా తీస్తే ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ నుంచి బయటకు తీసుకు వెళ్లినట్టు పక్కనే ఉండేవారు చెప్పారట.
దీంతో ఆమె తల్లిదండ్రులు ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో తమ కుమార్తె మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బన్నీ అనే వ్యక్తి లలితను తీసుకు వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఏదేమైనా వెండితెర మీద వెలగలేని తెలుగు అమ్మాయిలు కనీసం బుల్లితెర మీద అయినా రాణించాలన్న కోరికతో హైదరాబాద్కు వచ్చి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.