'మహానటి' సక్సస్తో ఒక రేంజ్ పాపులారిటీని దక్కించుకుంది కీర్తి సురేష్. ఊహించని ఆ పాపులారిటీ కమర్షియల్ సినిమాల సెలక్షన్ పరంగా కొంత డైలమాని క్రియోట్ చేసిన మాట వాస్తవం. అందుకే కీర్తి ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే సహజంగా కొంత గ్యాప్ కూడా వచ్చింది. అయితే గ్యాప్ కేవలం తెలుగులోనే. అందుకే ప్రస్తుతం వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ కీర్తి జోరు పెంచింది. ఓవైపు సౌత్ లో క్రేజీ సినిమాలకు సంతకాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ అవకాశాల్ని వదలకుండా ఓకే చేస్తోంది.


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన ఓ సినిమాకి సంతకం చేసింది కీర్తి. ఆ సినిమా టైటిల్ తో పాటు మిగతా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే సౌత్ లోనూ కథలు వింటోందట. కింగ్ నాగార్జున - నాగచైతన్య హీరోలుగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న బంగార్రాజు సినిమాకి కీర్తి ని సంప్రదించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమాలో చైతన్య సరసన కీర్తిని నటింపజేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారమైంది. అయితే ఈ సినిమాకి కీర్తి ఓకే చెప్పిందా లేదా? అన్నది ఇంకా సస్పెన్స్ గా ఉంది.


కానీ బంగార్రాజు చిత్రంలో నటించేందుకు కీర్తి ఆసక్తిగానే ఉందని తెలుస్తోంది. అయితే బంగార్రాజు టీమ్ నుంచి మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. బంగర్రాజు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జరుపుకుంటోంది. కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే బౌండ్ స్క్రిప్టు రెడీ చేసి సెట్స్ కెళ్లేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. నాగార్జున నటిస్తున్న మన్మథుడు 2 చిత్రీకరణ పూర్తవ్వగానే బంగార్రాజు సెట్స్ కెళతారని లేటెస్ట్ న్యూస్. ఈ జులైలోనే బంగర్రాజు ప్రారంభోత్సవం ఉంటుందన్న మాటా అక్కినేని కాంపౌండ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయిక ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే మజిలీ తో సూపర్ హిట్ అందుకున్న జంటగా చైతు-సమంత కి మంచి క్రేజ్ వచ్చింది. అందుకె బంగార్రాజు సినిమాలో కూడా చైతు పక్కన సమంత అయితే బావుంటుందని కూడా చిత్ర బృందం ఆలోచనలో ఉన్నారని టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: