జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున నానీ లాంటి వాళ్ళు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర పై షోలు కూడ హోస్ట్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ తో తమ కనెక్షన్ తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ కూడ ఇలాంటి వ్యూహాలే అనుసరించడానికి ప్రాధమికంగా అంగీకరించాడు అంటూ వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానులకు జోష్ ను కలిగిస్తున్నాయి. 

ఆ సక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసే ‘కొంచెం టచ్ లో ఉంటే చెపుతా’ కార్యక్రమం మళ్ళీ ఒక ప్రముఖ ఛానల్ లో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈకార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే సందర్భంలో ఒక ప్రముఖ సెలెబ్రెటీతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ షోకు మంచి మైలేజ్ వస్తుంది అన్న ఉద్దేశ్యంతో ప్రభాస్ ను కాంటాక్ట్ చేయడం అతడు ప్రాధమీకంగా ఈ షోకు అతిధిగా రావడానికి అంగీకరించడం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ షోకు ప్రభాస్ అతిధిగా రావడం వెనుక మరొక కారణం ఉంది అని అంటున్నారు. ఈ షో జూలై నెల చివరిలో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో అప్పటికి ‘సాహో’ రిలీజ్ డేట్ చాల దగ్గరలో ఉంటుంది కాబట్టి తన మూవీ ప్రమోషన్ కు కూడ ఈ కార్యక్రమం సహకరిస్తుందని ప్రభాస్ అభిప్రాయం అని అంటున్నారు. 

సాధారణంగా ప్రభాస్ ‘సాహో’ కు సంబంధించి వార్తలు వచ్చినా ఆసినిమా స్టిల్స్ రిలీజ్ అయినా ఒక సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో ఏకంగా ప్రభాస్ బుల్లితెర పై కనిపిస్తూ తన ‘సాహో’ గురించి ఆసక్తికర విషయాలు ప్రదీప్ తో షేర్ చేస్తుంటే ఇక ఆకార్యక్రమానికి వచ్చే రేటింగ్స్ బుల్లితెర రేటింగ్స్ రికార్డ్స్ ను షేక్ చేస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహంలేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: