తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం  వహించారు. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. జూన్ 28 న విడుదలయిన ఈ సినిమా మొదటి రోజు నుండి ఏమాత్రం తగ్గకుండా కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా మీద విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు.

 

సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కిన టాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్  సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి దిమ్మ తిరిగే వసూళ్లతో అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఈ సినిమా కోసం 20 నుంచి 25కోట్ల వరకు ఖర్చు చేయగా చాలా స్పీడ్ గా లాభాల్ని అందించింది.అయితే మొదటివారానికే సినిమా 100కోట్ల వసూళ్లతో నిర్మాతలకు కళ్లు చెదిరే వసూళ్లను గుమ్మరించింది.

 

బాలీవుడ్ లో చిన్న సినిమాలకు క్రేజ్ వస్తే దేశవ్యాప్తంగా కలెక్షన్స్ డోస్ పెరుగుతుంది. అదే తరహాలో కబీర్ సింగ్ కూడా క్లిక్కయ్యింది. ఇప్పటికే సినిమా 150కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక 200కోట్లను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. హీరోగ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న షాహిద్ బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకోవడం ఇదే మొదటిసారి.ఇక హీరోయిన్ కైరా అద్వానీ రేంజ్ కూడా మరింత పెరగడంతో అమ్మడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

 

షాహిద్ కపూర్ కెరియర్ లో ౧౦౦ కోట్లు దాటడం ఇదే మొదటిసారి. ఈ విషయం తెలిసి బాలీవుడ్ షాక్ కి గురవుతోందిట.  అయితే కబీర్ సింగ్ విజయం దృష్టిలో పెట్టుకుని షాహిద్ కపూర్ తన తర్వాతి సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటాడని, బాలీవుడ్ లో స్టార్ల పక్కన తనకు బెర్త్ ఖాయం అయినట్టే అని అనుకుంటున్నారు. ఇక చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి తన తర్వాతి సినిమాను బాలీవుడ్ లోనే తీయబోతున్నాడని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: