ఒకే ఒక్క సినిమా ఎలాంటి హీరోకైనా ఒక్కసారే స్టార్ హీరోని చేస్తుంది..అలాంటి అదృష్టం ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి దక్కింది.  సరైన హిట్స్ లేని సమయంలో రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’సినిమాతో బ్లాక్ బస్టర్ అయ్యింది. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాలు ఏకంగా జాతీయస్థాయి నటుడుని చేశాయి.  ప్రభాస్ నటించి సినిమాలు జాతీయ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సాహూ’సినిమా రూపొందుతుంది. 

ఇక ప్రభాస్ చాలా వరకు మీడియా ముందుకు రావడానికి, టీవీ షోల్లో పాల్గొనడానికి విముఖత చూపిస్తుంటారు.  అలాంటిది ఇప్పుడు ఈ హీరో ఓ టీవీ షోలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.  జీ తెలుగులో పాపులర్ టీవీ షో ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’  సిరీస్ ని మరోసారి ప్రారభించనున్నారు. ఈ కార్యక్రమానికి గతంలో యాంకర్ ప్రదీప్ హూస్ట్ గా వ్యవహరించారు.  ఇప్పుడు కూడా ఆయనే హూస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

ఇందులో భాగంగా ప్రభాస్ ఇంటర్వ్యూతో తొలి ఎపిసోడ్ ని లాంచ్ చేయాలని సదరు ఛానెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం.  ప్రభాస్ ని ఒప్పించే పనిలో ఉన్నారు షో నిర్వాహకులు. ప్రభాస్ కూడా ఈ షోలో కనిపించడానికిదాదాపు ఒప్పుకుంటాడని అంటున్నారు. అయితే దీనికి వెనుక మరో రహస్యం ఉందట..ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా శాటిలైట్ హక్కులను జీతెలుగు వారే సొంతం చేసుకున్నారు.

ఈ హక్కుల కోసం సదరు ఛానెల్ రూ.50 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ‘సాహూ’ మూవీ ప్రమోషన్ చేసినట్లు ఉంటుంది..ప్రభాస్ ని ఆ ఛానల్ ప్రజెంట్ చేసినట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ షోలో ప్రభాస్ ఆడియన్స్ తో పంచుకోబోతున్నట్లు టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: