టాలీవుడ్ లో తన పదునైన డైలాగులతో ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టె దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయన ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక కొత్త సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది పవన్ తో అయన తీసిన అజ్ఞాతవాసి పెద్ద డిజాస్టర్ గా నిలిచి త్రివిక్రమ్ కెరీర్ ని కొంత ఆలోచనలో పడేసింది అనే చెప్పాలి. అయితే ఆ తరువాత అయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన అరవింద సమేత సూపర్ హిట్ అయి మళ్ళి దర్శకుడిగా ఆయనకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. 

ఇక ప్రస్తుతం అదే ఊపుతో మంచి ఫామిలీ ఎమోషన్స్ తో కూడిన సబ్జెక్ట్ ను ఎంటర్టైనింగ్ గా అయన తీస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాలు అటుంచితే రెండు రోజుల క్రితం నటి, మరియు ప్రముఖ మహిళా దర్శరాలు శ్రీమతి విజయ నిర్మల గారు అకాలమరణం పొందిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరణంతో కృష్ణ గారు సహా అయన కుటుంబసభ్యులు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ఆమెను కడసారి చూసేందుకు ఎందరో సినిమా ప్రముఖులతో పాటు కొందరు రాజకీయనాయకులు సైతం రావడం జరిగింది. ఇకపోతే కొన్ని అనివార్య కారణాల వలన ఆమెను చివరి చూడడానికి రాలేకపోయినందుకు దర్శకుడు త్రివిక్రమ్ నేడు హీరో నరేష్ ని, కృష్ణ గారిని కలిసి విజయ నిర్మల గారి మృతికి చింతిస్తూ తన సంతాపాన్ని తెలిపారు. 

అయితే ఆ సమయంలో మహేష్ బాబు కూడా అక్కడకు వచ్చారట. ఇక కృష్ణ గారు, విజయ నిర్మల గారు అంటే తనకు ఎంతో అభిమానమని, తెలుగు చిత్ర పరిశ్రమలో 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డు సాధించిన ఘనత విజయ నిర్మల గారికి  మాత్రమే దక్కిందని, నటిగా మరియు నిర్మాతగా కూడా ఆమె విశేష సేవలు ఎంతో అభినందనీయం అని త్రివిక్రమ్, కృష్ణ గారి వద్ద ప్రస్తావించారట. ఇక తనకు ఎంతో ఇష్టమైన ఆమె నేడు మన ముందుకు లేకపోవడం ఎంతో బాధగా ఉందని, అలానే ప్రస్తుతం కృష్ణ గారి పరిస్థితి చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందని, ఆయనకు ఆ భగవంతుడు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ అన్నారట......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: