ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  గత కొంత కాలంగా మహేష్ బాబు ఒకే మూస పద్దతిలో చిత్రాల్లో నటిస్తున్నారని రూమర్లు వస్తున్నాయి.  దాంతో మహేష్ కాస్త కొత్తగా చేద్దామని భావిస్తున్న తరుణంలో వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకులు అనీల్ రావిపూడితో ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యారు.  ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ కూడా పెట్టారు. 

దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహర్షి సూపర్ సక్సెస్ అందించిన ఉత్సాహంతో మహేష్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మహేశ్ బాబు కు ఇది 26వ చిత్రం.  స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ చిత్రం కోసం 90 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కశ్మీర్లో 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని అంటున్నారు.  ఇక మహేశ్ బాబు లాభాల్లో వాటా తీసుకోనున్నాడనీ, మిగతా నటీనటులకి చెల్లించే పారితోషికాలే 25 కోట్ల వరకూ వుంటాయని అంటున్నారు. అంతే కాదు ఈ చిత్రంతో లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.  విజయశాంతికి పారితోషికంగా 3 కోట్ల వరకూ ముడుతుందని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: