ఇండియన్ జేమ్స్ కామెరూన్ అనిపించుకున్న దర్శకుడు శంకర్. ఆయన చిత్రాల్లో గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేస్తారు. మనం చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆయన తీసే సినిమాలు ఎంత సందేశాత్మకంగా ఉంటాయో అంత ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి.  దక్షిణాది సినిమాల పవర్ ఏంటనేది రోబో సినిమా ద్వారా చూపించి, మొత్తం ఇండస్ట్రీని ఇటు వైపుకు తిప్పుకున్నాడు.  విక్రమ్ తో తీసిని "ఐ" , రోబో 2.౦ సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేదు.

 

రోబో 2.౦ తర్వాత  కమల్ హాసన్ తో "భారతీయుడు 2" సినిమా చేస్తున్నాడని వార్త వచ్చింది. దాని పనులు కూడా స్టార్ట్ చేసారు కానీ మధ్యలోనే అది ఆగిపోయింది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు. ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేవారెవరు లేరు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన తర్వాత శంకర్ తన తర్వాత ప్రాజెక్ట్ ఏంటనేది ఇంతవరకు తెలిసి రాలేదు.

 

ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. సీనియర్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' .. స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ కథానాయకులుగా ఒక సినిమాను రూపొందించే పనిలో శంకర్ వున్నాడని చెప్పుకుంటున్నారు. స్టార్ హీరోల వారసులు కావడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

 

ప్రస్తుతం ధృవ్ "ఆదిత్య వర్మ" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించిన "అర్జున్ రెడ్డి"కి రీమేక్.  మొదట ఈ సినిమాకి బాలా దర్శకత్వం వహించాడు. అయితే కొన్ని కారణాల వల్ల బాలా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు అయిన "గిరిశాయ" చేత ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా తర్వాత ధృవ్ శంకర్ దర్శకత్వంలో కనిపిస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: