తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి సాయిపల్లవి. ‘ఫిదా’లో తన అందాలతోనే కాదు, నటనతోనూ యువతను ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు భయపెడతానంటోంది. మలయాళంలో ఆమె నటించిన సూపర్హిట్ చిత్రం ‘అథిరన్’. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నారు.
సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రానికి వివేక్ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా మలయాళంలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు జయంత్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు.
ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తాం’’ అని అన్నారు. ప్రస్తుతం సాయి పల్లవికి తెలుగులో బాగానే మార్కెట్ వుంది. దీన్ని కాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలని అనుకుంటున్నారు.