సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ యాక్షన్ కింగ్ అర్జున్ తో చేసిన ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గత కొన్నాళ్ల నుంచి భారీ బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించిన సినిమాలు విఫలమవుతున్న క్రమంలో తాను గతంలో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినిమాలకు సీక్వెల్ చేసే శ్రీకారం చుట్టారు ‘భారతీయుడు’ సినిమా తో స్టార్ట్ చేశారు శంకర్. కమల్ హాసన్ తో గతంలో చేసిన భారతీయుడు సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సెన్సేషనల్ రికార్డులు మరియు కలెక్షన్స్ సాధించింది.


ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్ లో వస్తే ఎవరు చూడకుండా ఉండలేరు. ముఖ్యంగా ఈ సినిమాలో ఏ ఆర్ రెహమాన్ ఇచ్చినా బాణీలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో తాను గతంలో అర్జున్ తో చేసిన ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ చేయడానికి డైరెక్టర్ శంకర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవరు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.


ఇదే క్రమంలో డైరెక్టర్ శంకర్ భారతీయుడు సీక్వెల్ షూటింగ్లో ఉన్నారు. దీంతో భారతీయుడు2 సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుని త్వరలో విడుదల అయ్యాక వెంటనే మహేష్ తో ఒకే ఒక్కడు సినిమా చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. మరి మహేష్ ఈ సీక్వెల్ సినిమాలో చేస్తాడో లేదో చూడాలి. మామూలుగా రీమిక్స్ అంటేనే దగ్గరకు రానీయని మహేష్ శంకర్ ఇచ్చే ఆఫర్ కి ఎలా స్పందిస్తాడో అని చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు గమనిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: