టాలీవుడ్ లో చాలామందే స్టార్ హీరోయిన్లు ఉన్నాకానీ వాళ్ళందరిలో అనుష్క స్థానం ప్రత్యేకమైనది అని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ కూడా స్వీటీనే. అయితే ప్రస్తుతం అనుష్క 'సైలెన్స్' అనే సినిమాలో నటిస్తోంది. ఇక కొంతకాలం క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఈ సినిమా 50% చిత్రీకరణ పూర్తి చేసుకుందని లేటెస్ట్ న్యూస్. 

త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని 'సైలెన్స్' చిత్ర బృందం ప్రకటించారు.  ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేలోపే అనుష్క తన అభిమానులకు ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "త్వరలో స్పాట్ లైట్ లోకి వస్తాను #సైలెన్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అనుష్క దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ అప్డేట్ కావడం తో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. 

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్ మైఖెల్ మ్యాడిసన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ లో నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: