బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా' సినిమాతో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న నటి భాగ్యశ్రీ. అదే చిత్రం తెలుగులో ప్రేమపావురాలుగా వచ్చింది. ఇటు హిందీ అటు తెలుగు రెండు భాషల్లోనూ ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఆ తరువాత హిందీలో కొన్ని చిత్రాల్లో నటించింది.
తెలుగులో తాజాగా ఆమె భర్త హిమాలయను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అంబోలి పోలీసు అధికారుల సమాచారం మేరకు... హిమాలయను అతని నివాసంలో నిన్న అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యాపారవేత్త అయిన హిమాలయ సినీ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
దస్సానీ 1992లో ‘పాయల్’ అనే బాలీవుడ్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇటీవల భాగ్యశ్రీ, దస్సానీల కుమారుడు అభిమన్యు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ అనే సినిమాతో బాలీవుడ్కు పరిచయమయ్యారు. భాగ్యశ్రీ ‘మైనే ప్యార్ కియా’తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది.