అక్కినేని నాగార్జున మన్మధుడు 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం మన్మధుడు మూవీ వచ్చింది. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి డైలాగులు రాశారు. ఆ డైలాగులే సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ వస్తున్నది. మన్మధుడు మూవీలో నాగార్జున లిప్ స్టిక్ కంపెనీ యజమానిగా చేశారు. మన్మధుడు 2 లో నాగార్జున పెర్ఫ్యూమ్ కంపెనీ యజమానిగా చేస్తున్నారు. ఇందులో రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.
నాగార్జున రొమాన్స్ ఇందులో పీక్ స్థాయిలో ఉండబోతున్నది. కామెడీ ఎంత హైలైట్ అవుతుందో తెలియదుగాని, రొమాన్స్ కు మాత్రం మంచి మార్కులు పడతాయని అంటున్నారు. ఆగష్టు 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా రిలీజ్ తరువాత మరో వారంలోనే సాహో రిలీజ్ కాబోతున్నది.
వారం రోజుల్లో సాహో ఉంటుంది కాబట్టి వారంలోనే వీలైనంతగా కలెక్షన్లు రాబట్టుకోవాలి. కాబట్టి రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు నాగార్జునకు కాకూండా.. ఇందులో కీర్తి సురేష్ మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో నటిస్తున్నారు.