తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ లోను అదే విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే అదే కథతో, అదే స్క్రీన్‌ప్లే తో తమిళంలో కూడా ఈసినిమాను విక్రమ్ కొడుకుని హీరోగా పెట్టి డైరెక్టర్ బాలా సినిమా తీశాడు. ఈ సినిమా షూటింగ్ సరిగా సాగలేదని, అవుట్‌పుట్‌తో సంతృప్తి చెందని టీమ్ రష్ మొత్తాన్ని చెత్త బుట్టలో పడేసి.. మళ్లీ కొత్తగా సినిమా తీయాలని డిసైడయ్యారు.

అయితే ఈ సారీ బాలా కాకుండా అర్జున్ రెడ్డి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరీశయ్యతో మళ్లీ 'ఆదిత్య వర్మ' పేరుతో కొత్తగా సినిమా మొదలుపెట్టారు. ఈసినిమా ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ టీజర్ కి అదే స్పందన వచ్చింది. అదే నెగెటివిటీ కంటిన్యూ అయింది. ప్రేక్షకులు ఈ టీజర్ ని పూర్తిగా స్కిప్ చేసేశారు. వాస్తవానికి ఈసినిమాని ఈనెలలో రిలీజ్ చేయాలి అనుకున్నారట చిత్ర బృందం. కానీ ఇప్పుడు ఈసినిమాని రిలీజ్ చేసేందుకు సాహసం చేయడంలేదట. ఈసారి టీజర్ రిలీజ్ తర్వాత కనిపించిన నెగెటివిటీ చూశాక ధ్రువ్‌ను పెట్టి ఈ సినిమా తీయడమే తప్పన్న విషయం స్పష్టమైందని సమాచారం. 

డైరెక్టర్ దగ్గర నుండి విక్రమ్ వరకు ఈ సినిమాను ఏం చేయాలో తెలియని డైలమాలో ఉన్నారట. ధృవ్ డెబ్యూ సినిమాగా 'ఆదిత్య వర్మ' రిలీజ్ చేస్తే అతనికి జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని.. ఇలాంటి సినిమాతో కెరీర్ లాం చెస్తే అతడిపై జనాల్లో ఓ నెగటివ్ ముద్ర పడుతుందని విక్రమ్ స్నేహితులు అండ్ విక్రమ్ భావిస్తున్నాడట. అందుకే ఈసినిమాను పక్కన పెట్టాలని చూస్తున్నారని లేటెస్ట్ అప్‌డేట్. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చయిందో అంత విక్రమ్ ఇచ్చేసి సినిమాను పర్మనెంట్‌గా ల్యాబ్‌కే పరిమితం చేసేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: