టాలీవుడ్ కి గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు అర్జున్, ఆ తరువాత వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఆర్య సినిమా, అయన కెరీర్ నే మార్చేసింది. ఇక అప్పటినుండి బన్నీ యూత్ ఐకాన్ గా మారాడు. ఆపై అయన నటించిన పరుగు, దేశముదురు, ఆర్య 2 , రేస్ గుర్రం, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసాడు. 

ఇక ఎప్పటికపుడు విడుదలయ్యే సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే బన్నీ, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల సక్సెస్ పై ఆ చిత్ర యూనిట్ సభ్యులను కలిసి తన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ కి కొత్త హీరోలు, మరియు దర్శక నిర్మాతలు రావడం ఎంతో శుభపరిణామం అని ఆయన అన్నారు. 

ఇక తాను చూసిన ఈ రెండు సినిమాల జామర్లు వేరు వేరని, అయినప్పటికీ ఆయా చిత్రాలను నడిపించిన దర్శకులు, నటించిన నటీనటుల గురించి ఎంత చెప్పినా తక్కువే అని బన్నీ అన్నారు. అంతేకాక బన్నీ ఆ సినిమా హీరోలు మరియు దర్శకులతో కలిసి ఫోటోలు దిగి తన సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం బన్నీ పెట్టిన ఆ పోస్టులు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నారు. అంతేకాదు బన్నీ మంచి మనసుపై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: