సప్నా చౌదరి... హర్యానాలో ఈ పేరు తెలియనివారుండరు.ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం తన ఆటపాటలతో అల్లాడించిన ప్రముఖ డాన్సర్ సప్నా చౌదరి.తాజాగా ఈ డాన్సర్ బీజేపీలో చేరింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

 

మనోజ్ తివారీ సమక్షంలో సప్నా చౌదరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ లాల్ తదితరులు హాజరయ్యారు. ఈమె  ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోచేరుతారని పుకార్లు వినిపించాయి.

 

అయితే అలాంటిదేమి లేదని ఆమె తేల్చి చెప్పేశారు.సప్నా చౌదరి కాంగ్రెస్‌లో చేరారంటూ.. ప్రియాంక గాంధీతో ఆమె దిగిన ఫోటో మీడియాలో సర్క్యులేట్ కావడంపై కూడా ఆమె అప్పట్లో స్పందించారు. ఆ ఫోటో పాతది అని తెలిపారు.

 

గతంలో తాను చాలాసార్లు ప్రియాంక గాంధీని కలిశానని.. ఆయా సందర్భాల్లో దిగిన ఫోటోలే ఇప్పుడిలా సర్క్యులేట్ అవుతున్నాయని అన్నారు. ఆ తర్వత ఎన్నికల్లో మనోజ్ తివారీ తరపున సప్నా చౌదరి ప్రచారం నిర్వహించారు. బీజేపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనోజ్ తివారీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: