విజయ్ దేవరకొండ అంటే.. అతనో రౌడీ హీరో. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఆడియో ఫంక్షన్‌లు, వివిధ సినిమా ఫంక్షన్లలలో తన ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఇస్తూ తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. అయితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రౌడీ హీరో సెన్సిటివ్‌గా మారిపోయారు. తమ్ముడ్ని తలచుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుని తనలోని కొత్త కోణాన్ని చూపించారు. 


దొరసాని’ సినిమా పూర్తి చేసి ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు పూజా కార్యక్రమాలకు రావాలని ఉన్నా ఆపుకున్నా.. టీజర్ షేర్ చేయాలని అనుకున్నా కాని ఆపుకున్నా.. ఈ సినిమాలో నాకు చాలా పాటలు ఇష్టం షేర్ చేద్దాం అనుకున్నా కాని ఆపుకున్నా.. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో.. తనను తాను ఎలా నిరూపించుకోవాలో తెలుసుకుంటాడని ఈ సినిమాను ఇప్పటి వరకూ పట్టించుకోలేదంటూ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. 


ఎప్పుడు చూడని విజయ్ దేవరకొండ ని చూసి అక్కడ ఉన్నవారందరూ కంగుతిన్నారు, అలానే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి, వాళ్ళ తమ్ముడు మరియు వాళ్ళ అమ్మగారితో సహా. అయితే, విజయ్ స్పీచ్ వైరల్ అవ్వగానే, ఆనంద్ దేవరకొండ మీద మల్లి ట్రోల్ల్స్ స్టార్ట్ అయ్యాయి, విజయ్ లేకపోతే ఆనంద్ కి ఎవ్వరు ఛాన్స్ ఇవ్వరు అని, కల్లబొల్లి కబుర్లు అన్ని ప్రొమోషన్స్ కోసమే అని, విజయ్ ఏడ్చినంత మాత్రాన సినిమా హిట్ ఎవ్వడు అని చాలా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.


దీనికి కౌంటర్ గా, విజయ్ ఫాన్స్ తమ హీరో సినిమాల్లో మాత్రమే నటిస్తాడని, ఏది మాట్లాడిన నిజమే మాట్లాడతాడని కౌంటర్లు వేస్తూ, ఆనంద్ దేవరకొండ లో సత్తా ఉంటె, సినిమా హిట్ అవుతుంది, లేదంటే తన పని తాను చూసుకుంటాడు అని సపోర్ట్ కూడా వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: