గత కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో మంచు విష్ణు. ఎన్నో వివాదాల మధ్య రిలీజైన "ఓటరు" కూడా నిరాశ పర్చింది. అయినా మంచు విష్ణు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని మూడు యాక్షన్ డ్రామా చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్ను రూపొందించనున్నారు. ఇందులో ఓ హాలీవుడ్ చిత్రం కూడా ఉంది.అందులో భాగంగా రెండు చిత్రాలు, వెబ్సిరీస్ను ఆదివారం తన ప్రొడక్షన్ ఆఫీస్లో లాంఛనంగా ప్రారంభించారు.
విష్ణు మంచు, కాజల్ జంటగా ఓ యాక్షన్ డ్రామా ముందుగా రూపొందనుంది. ఇండియాలో ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకునే ఓ నిజ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. రూ. 2800 కోట్ల దోపిడీ ఎలా జరిగిందనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేనున్నారు.
సుబ్బరాజు అనే కొత్త దర్శకుడితో కలిసి న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీని నిర్మించనున్నారు మంచు విష్ణు. ఈ చిత్రానికి `మిరా రోడ్` అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇది కూడా నిజ ఘటనను ఆధారంగా చేసుకునే తెరకెక్కనుంది. ఈ సినిమాలో స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలోనే విడుదల చేయనున్నారు.అలాగే మంచు విష్ణు తొలిసారి హాలీవుడ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. జెఫ్రె చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ హాలీవుడ్ చిత్రానికి విష్ణు సతీమణి విరానికా మంచు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . వయా మార్ ఎంటర్టైన్మెంట్, ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలుస్తాయి.రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితుల్లోని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందబోయే పొలిటికల్ డ్రామా వెబ్సిరీస్ను విష్ణు మంచు నిర్మిస్తున్నారు.