యంగ్ హీరో నితిన్ వరుసగా ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నా కెరీర్ ప‌రంగా సరైన సక్సెస్‌లు ఉండటం లేదు. నితిన్ తాజాగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 


ఈ సినిమాలో నితిన్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఈ క్రమంలోనే మూడో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబుకు పోకిరి సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇలియానా నితిన్ సరసన 2009లో రెచ్చిపో సినిమాలో కూడా నటించింది. పదేళ్ల తర్వాత తిరిగి నితిన్‌తో కలిసి ఆమె నటిస్తోంది. 


ఇదిలా ఉంటే 2012లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమా తర్వాత ఇలియానా తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.ఆ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే మకాం వేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. రీసెంట్‌గా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: