టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి గత కొంత కాలంగా ఏ సినిమా కలిసి రావడం లేదు.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య శిష్యుడైన పూరి జగన్నాధ్ ‘బద్రి’సినిమాతో దర్శకుడిగా మారారు.  ఆ తర్వాత వచ్చిన ఇడియట్ తో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  ఈ సినిమాతోనే రవితేజ హీరోగా మారారు.  ఆ తర్వాత పోకిరి సినిమాతో మహేష్ బాబు ని కెరీర్ ని ఎక్కడికో తీసుకు పోయాడు. టాలీవుడ్ అత్యంత వేగంగా క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథే. 


ఇలా ఒక్కో హీరోకి ఒక్కో మూవీతో మంచి లైఫ్ ఇచ్చిన పూరి ‘టెంపర్’ సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.  ఎన్టీఆర్ తో ‘టెంపర్’మూవీ తీసిన పూరి ఆ రేంజ్ హిట్ కోసం తహ తహలాడిపోతున్నాడు.  ఈ నేపథ్యంలో ఎనర్జిటిక్ రామ్ తారసపడ్డారట..అంతే ఈ హీరోని దృష్టిలో పెట్టుకొని ఫుల్ లెన్త్ మాస్ ఎంట్రటైన్ మెంట్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది.


ఇటీవల వరంగల్ లో ఇస్మార్ట్ బోనాలు పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి తన మనసులో మాట చెప్పారు.  తనకు టెంపర్ తర్వాత సరైన హిట్ లేదని తెలిపాడు.  తాను విపరీతమైన ఆకలితో ఉన్న సమయంలో రామ్ దొరికాడని అందుకు తగ్గ సినిమానే వచ్చిందని అన్నారు.ట్రైలర్ కూడా ఆసక్తికరంగా లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


మరి పూరి ఈసారి  స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తాడని కొందరు అభిమానులు నమ్ముతున్నారు.  ఈ మూవీలో పవర్ ఫుల్ మాస్ పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయని అన్నారు. హీరోయిన్లు కూడా అందరు మెచ్చేలా ఉండబోతున్నారని తెలిపారు. పూరి సినిమాలు కథ కంటే స్క్రీన్ ప్లే పరంగా ఎక్కువ విజయం సాదిస్తుంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: