అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసుకోగా ఇంతవరకు సినిమాలో హీరోయిన్ ను సెలెక్ట్ చేయలేదు. 


మొదట్లో కియరా అద్వాని, రష్మిక మందన్న పేర్లు వినపడ్డా ఫైనల్ గా నిఖిల్ కోసం తమిళ అమ్మాయి నివేదా పేతురాజ్ ను సెలెక్ట్ చేశారట. తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ తెలుగులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమా చేసింది. ఆ తర్వాత చిత్రలహరి, ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్టైన బ్రోచేవారెవరూఅ సినిమాల్లో నటించింది.


తనకు ఇచ్చిన పాత్రకు పర్ఫెక్ట్ అభినయం కనబరిచే నివేదా పేతురాజ్ పై అఖిల్ కన్నేశాడు. భాస్కర్ ఆమె పేరు సిఫార్సు చేయగా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. బొమ్మరిల్లు సినిమాతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న భాస్కర్ ఆ తర్వాత ఆ రేంజ్ సినిమాలు తీయలేకపోయాడు,


అయితే అఖిల్ సినిమాతో మళ్లీ భాస్కర్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. చేసిన 3 సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోవడంతో భాస్కర్ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. మరి ఈ సినిమా అయినా అఖిల్ కోరుకునే హిట్ ఇస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: