'ఇస్మార్ట్ శంకర్' సినిమా పై పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భవిష్యత్తు ఆధారపడి ఉంది. గతంలో పూరి జగన్నాథ్ అతికొద్ది సమయంలోనే సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ప్రస్తుతం మట్టికి చేస్తున్న సినిమాలు ప్రతీది ఫ్లాపవడంతో తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలకు తానే నిర్మాతగా మారాల్సి వచ్చింది. మరో పక్క పోతినేని రామ్ కి కూడా బ్యాడ్ టైం నడుస్తుంది. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్నా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గురించి ఆసక్తిగా గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెందినవారు.


పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఆ ప్రాంతంలో నిర్వహించడంతో...'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తెలుసుకున్నవారు ఇండస్ట్రీలో ఉన్నావారు కేక అని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సినిమా హీరోయిన్లు నిధి అగర్వాల్.. నభా నటేష్ ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సులో బోనాలు తలకెత్తుకొని నడుచుకుంటూ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొత్త కళ వచ్చింది. 


ఒక సినిమా ఈవెంట్లో ఇలా బోనమెత్తడం ఇదే మొదటిసారి. నిధి ఒక క్రీమ్ కలర్ ఛోళి లెహెంగా లో వస్తే.. నభా లైట్ గ్రీన్ కలర్ ఛోళి..రెడ్ కలర్ లెహెంగా ధరించి ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఇద్దరూ అందాలబొమ్మలలాగా కనిపించారు. అయితే ఇస్మార్ట్ రామ్ మాత్రం టోర్న్ షర్టు వేసుకొని రగ్డ్ లుక్ లో కనిపించాడు. ఇక ఈవెంట్ అంతా ఫుల్ జోష్ లో జరిగింది. పూరి మాట్లాడుతూ తనకు 'టెంపర్' తర్వాత సరైన హిట్ పడలేదని.. ఆకలిగా ఉన్న టైమ్ లో రామ్ దొరికాడని..సినిమాలో రామ్ అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల అవుతుందని ఎనౌన్స్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: