మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్లో అకౌంట్ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం చెర్రీ తన పేరుమీద ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేయగానే ఒకరోజు కూడ గడవకుండానే చరణ్ ఎకౌంటు కు 2లక్షల 9వేల మంది ఫాలో అవడం షాకింగ్ న్యూస్ గా మారింది.
అయితే చరణ్ కేవలం అకౌంట్ను మాత్రమే ఓపెన్ చేసాడు కాని ఇప్పటివరకు ఆ ఎకౌంటులో ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయితే ఈ శుక్రవారం తాను ఇన్ స్టాలోకి తన తోలి పోస్ట్ చేస్తానని చెపుతూ తన ఇంటిలోని స్విమింగ్ పూల్ లో ఈత కొడుతూ తన ఫ్యాన్స్ కు వెరైటీగా ఒక వీడియో మెసేజ్ పెట్టాడు.
‘‘ఈ శుక్రవారం ఇన్స్టాలోకి రాబోతున్నా. అక్కడ మీతో కనెక్ట్ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది నాకు కొత్త ఫైనల్ గా నేను ఇన్ స్టాను ఎంచుకున్నాను’ అంటూ చరణ్ పెట్టిన మెసేజ్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. సాధారణంగా చరణ్ సోషల్ మీడియాకు చాల దూరంగా ఉంటాడు.
చరణ్ కు ఫేస్ బుక్ లో అదేవిధంగా ట్విటర్ లో అకౌంట్లు ఉన్నప్పటికీ కొన్ని కారణాలు వల్ల అప్పట్లో ఆ అకౌంట్ను డీయాక్టివేట్ చేశాడు. అయితే చరణ్ భార్య ఉపాసన సలహా ప్రోత్సాహాలతో ఇప్పుడు మళ్ళీ చరణ్ ఇన్ స్టా లోకి వస్తున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో శుక్రువారంనాడు చరణ్ షేర్ చేయబోయే మొదటి పోస్ట్ ఏమిటి అన్న ఆతృత ఇప్పటి నుంచే అభిమానులలో పెరిగిపోతోంది..