భారీ అంచనాలతో విడుదల అయిన ‘ఓ బేబి’ సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ రాబడుతున్న పరిస్థితులలో ఈమూవీ కలక్షన్స్ పడిపోకుండా నిలబెట్టడానికి సమంత ఈమూవీ విడుదలైన అన్ని ఏరియాల్లోని థియేటర్స్ కు వెళ్ళుతు ఈమూవీని మరింత ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంలో  ‘ఓ బేబి’ టీమ్ విజయవాడ లోనిర్వహించిన  థాంక్స్ మీట్ లో సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈమూవీకి దర్శకత్వం వహించిన నందినీ రెడ్డిలోనే ‘ఓ బేబి’ అక్క ఉందని తనకు తెలిసి ఆమె కంటే మంచిగా ఈ సినిమా ఎవరూ తీయలేరని అంటూ సమంత నందిని రెడ్డ్డి పై ప్రశంసలు కురిపించింది ఈసినిమా రూపొందించే సమయంలో యూనిట్ అంతా రిస్క్ చేస్తున్నామేమో అని భయ పడ్డ విషయాలను వివరిస్తూ ‘ఓ బేబి’ విడుదల తరువాత తమ భయాలు అన్ని తొలగిపోయాయి అని కామెంట్స్ చేసింది. 

ఇదే సందర్భంలో సమంత మాట్లాడుతూ మరొక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది. హైదరాబాద్ ఒక ముసలావిడ కనీసం నడవలేని స్థితిలో ఉండి కుడా తన ‘ఓ బేబి’ సినిమాను చూసి అదే ధియేటర్ లో తాను ఉన్నానని తెలుసుకుని తన వద్దకు చాల కష్టపడి వచ్చి తనకు కూడ ‘ఓ బేబి’ లాగే పరుగులు తీయాలని ఉంది అంటూ చెప్పినప్పుడు తన కంట కన్నీరు వచ్చిన విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు తాను ఆ మహిళ కోసం దేవుడుని ప్రార్ధిస్తాను అని చెప్పి ఆమెకు నమ్మకం కలిగించిన విషయాన్ని కూడ గుర్తుకు చేసుకుంది. 

టివీలను వదిలి మహిళలు సినిమాలకు రాని పరిస్థుతులలో చాలామంది వృద్దులు ముఖ్యంగా మహిళలు ‘ఓ బేబి’ ధియేటర్లలో కనిపిస్తూ ఉండటం సంచలనంగా మారింది. ఇలాంటి సంచలన విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా కాబోలు సమంత త్వరలో నందినీ రెడ్డితో మరో సినిమాను చేయబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: