ఒక చిత్రం రిలీజ్ అయ్యే ముందు ఆ చిత్ర యూనిట్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అందరికీ తెలిసింది.  షూటింగ్ మొదలు ప్రొడక్షన్ పనులు, ప్రీరిలీజ్ ఫంక్షన్, సెన్సార్ సర్టిఫికెట్ చివరికి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఎంతో టెన్షన్ పడుతుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ - భరత్ కమ్మ కాంబినేషన్లో 'డియర్ కామ్రేడ్' రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది. ఆ మద్య టీజర్, లిరికల్ సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. 

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ చూసి ఓ అర్జున్ రెడ్డి, ఓ గీతాగోవిందం మడదపెట్టి కొట్టాడా అనిపిస్తుంది.   ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందిస్తూ, "నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నాం. అందువలన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోను ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నాము. అయితే ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది నాకు టెన్షన్ ఎక్కువై నిద్ర పట్టడం లేదని విజయ్ దేవరకొండ అన్నారు.

రేపు మా తమ్ముడు నటించిన ‘దొరసాని’చిత్రం రిలీజ్ కి ఉంది. వాడు హ్యాపీగా నిద్రపోతూ ప్రశాంతంగా ఉన్నాడు..గతంలో నేను కూడా మూవీస్ రిలీజ్ అంటే ప్రశాంతంగానే ఉండేవాడిని కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరు..నా పై అభిమానులు ఎంతగా అంచనాలు పెట్టుకున్నారో తెలుసు..అందుకే ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో  అన్న టెన్షన్ మొదలైందని అన్నారు. 'డియర్ కామ్రేడ్' మాత్రం ఏడాది పాటు మా చేతిలో వుండి బయటికి వెళుతుండటంతో టెన్షన్ అవుతోంది అని చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: