మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. 

ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది. ఇకపోతే మరోవైపు మెగాస్టార్ నటించబోయే తదుపరి సినిమాకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నట్లు సమాచారం. కెరీర్ పరంగా ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకుని ముందుకు సాగుతున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్లుగా ఎంపికైనట్లు పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారం అవుతుండగా, నేడు బాలీవుడ్ నటి, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ని మెగాస్టార్ ప్రక్కన తీసుకోవడానికి నిర్ణయించినట్లు సమాచారం. 

రెండు రోజుల క్రితం దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా కథను ఐష్ కు వినిపించడానికి ముంబాయి వెళ్లడం జరిగిందని, కథ నచ్చిన ఐష్, మెగాస్టార్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్. అయితే ఈ వార్తను ఎక్కడా కూడా బయటకు ప్రొక్కకుండా యూనిట్ సభ్యులు జాగ్రత్త పడ్డట్లు చెప్తున్నారు. మరి నేటి ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఇంకా వెల్లడి కావలసి ఉన్నప్పటికీ, ఒకవేళ నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఇది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పాలి.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: