ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో స్టార్ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ సినిమాతో డైరక్టర్ అద్భుత సృష్టి అంతా ఇంతా కాదు.. మిని బాహుబలి సినిమాలా కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 


ఈ సినిమాతో యశ్ కూడా స్టార్ డం తెచ్చుకున్నాడు. ఆల్రెడీ కన్నడ స్టార్ హీరో అయిన యశ్ ఇప్పుడు సౌత్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ తెలుగు సినిమా చేస్తాడని తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం కె.జి.ఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్ సినిమా అని వార్తలు వచ్చాయి. 


యువి క్రియేషన్స్ వారు ఈ సినిమా నిర్మిస్తారని అన్నారు. ప్రశాంత్ నీల్ తెలుగు సినిమా చేస్తున్నాడు కాని ప్రభాస్ తో కాదు ఎన్.టి.ఆర్ తో అని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారట. మైత్రి నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అఫిషియల్ గా ఈ విషయాన్ని చెప్పారు.


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందట. కె.జి.ఎఫ్ సినిమా చూసి మెచ్చిన తారక్ డైరక్టర్ కు తనకు సూటయ్యే కథ సిద్ధం చేయమని చెప్పాడట. ఎన్.టి.ఆర్ తో కన్నడ దర్శకుడు సినిమా అంటే ఇక ఆ సినిమా రేంజ్ ఎంతన్నది ఊహించుకోవచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: