మైత్రీ మూవీ మేకర్స్ ప్లానింగ్ చూస్తుంటే ఒకప్పుడు వైజయంతీ మూవీస్ ప్లానింగ్ కనపడుతోంది. టాలీవుడ్ లో అగ్రనిర్మాణ సంస్థగా దాదాపు ప్రతి అగ్రహీరోతో సినిమాలు చేసింది. ఇప్పుడు మైత్రీ బ్యానర్ కూడా అదే చేస్తోంది. మరో ఐదేళ్లు వీరి బ్యానర్ ఖాళీ లేనట్టే కనబడుతోంది. అగ్రహీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలందరితో సినిమాలు చేయటానికి కథలు కూడా సిద్ధం చేస్తోంది.

 

మైత్రీ బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలనేది తమ డ్రీమ్ అని చెప్పారు. ఆయన ఇమేజ్ కు సరిపడే కథ సిద్ధం చేస్తున్నామని.. త్వరలో కథ వినిపించి మెప్పించగలమనే నమ్మకంతో ఉన్నామని” అన్నారు. డైరెక్టర్ ఎవరన్నది ఫిక్స్ కాలేదన్నారు. కొరటాలతో ఉన్న బాండింగ్ తో ఆయనతోనే డైరెక్ట్ చేయిస్తారా.. అంటే ఇప్పటికే చిరంజీవి-కొరటాల కాంబినేషన్ తో సినిమా ఉంది కదా.. అన్నారు. కథను బట్టి ఫైనల్ చేస్తామన్నారు. మహేశ్ తో సినిమా కూడా ప్లాన్ చేశామని 2020లో ఆ సినిమా ఉంటుందని అన్నారు.

 

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో సినిమా ఇప్పటికే ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ – కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో సినిమా ఉండే అవకాశం ఉంది. కథ వినాలని ఇప్పిటికే మైత్రీ వారికి ఎన్టీఆర్ సూచించినట్టు సమాచారం. మైత్రీ బ్యానర్ లో విజయ్ దేవరకొండ-రష్మిక చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఈ నెల 26 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే పవన్ కల్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చిన మైత్రీ బ్యానర్ లో ఆ సినిమా ఉంటుందా లేదా అన్నది మాత్రం సస్పెన్సే.


మరింత సమాచారం తెలుసుకోండి: