టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ అంటే టాలీవుడ్ లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఓ సెన్సేషన్ అంటారు.  ముక్కుసూటిగా మాట్లాడే ఆయన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు.  ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఎంతో సపోర్ట్ గా నిలిచారు.  ఒకదశలో ఆయన టీడీపీని కడిగిపడేసిన తీరు చూస్తే ఎవ్వరైనా షాక్ తింటారు.  ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 

పోసాని ఈ మధ్యనే హెర్నియా ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు సమాచారం అందుతోంది. దాంతో పోసాని మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి హెర్నియా ఆపరేషన్ జరిపినట్లు, ఒకట్రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లు సమాచారం. కాకపోతే ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

ప్రస్తుతం నటుడిగా పోసాని ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి త్వరగా కోలుకుని  మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తే..రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా లేక సినిమా రంగానికే ప్రాధాన్యత ఇస్తారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: