తెలుగు గత శుక్రవారం రిలీజ్ అయిన ‘ఓ బేబీ’మంచి విజయం అందుకొని కలెక్షన్ల దిశగా ముందుకు సాగుతుంది.  నందినిరెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై అక్కినేని సమంత హీరోయిన్ గా ‘ఓ.. బేబీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  అయితే ఈ సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొల్పిన విషయం తెలిసిందే. 

అయితే ఈ మూవీ గురించి ప్రత్యేక శ్రద్ద పెట్టుకున్న దగ్గుపాటి రానా ఇప్పటికే బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మూవీ అక్కడ వారికి చూపించండతో వారు చాలా గొప్పగా ఇంప్రెస్ అయినట్లు సమాచారం. అయితే ఈ పాత్రపై ఎవరు అనే విషయం పై సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత కాస్త బబ్లీగా కనిపించే హీరోయిన్ ఆలియా భట్ అని తెలిసింద.

ఇంకేముంది బాలీవుడ్ ‘ ఓ బేబీ’కి ఆలియా భట్ కరెక్ట్ సూట్ అవుతుందని భావిస్తున్నారట. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అలియా భట్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. మరి ఈమె ‘ఓ… బేబీ’ రీమేక్ కోసం ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: