యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ లేటెస్ట్ భారీ సినిమా సాహో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరో నెలరోజుల్లో విడుదల డేట్ వుండడంతో, లాస్ట్ మినిట్‌లో టెన్షన్ లేకుండా చూడాలని గట్టిగా వర్క్ చేస్తున్నారు. చాలా భాషల్లో విడుదల చేయాల్సి వుండడం, బాలీవుడ్ లో భారీ విడుదల ప్లాన్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రింట్లు పంపాల్సి వుండడం వంటి కారణాలతో పదిరోజులు ముందుగానే అన్నీ పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు చిత్ర బృందం.
 
అంతేకాదు ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. గంట ఇరవై నిమషాల డ్యూరేషన్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ లాక్ చేసారట. సెకండ్ హాఫ్ కూడా ఫైనల్ ఎడిట్ జరిగి లాక్ చేసిన తరువాత మొత్తం సినిమాను చూసుకుని, అప్పుడు అలానే వుంచాలా? ఎక్కడైనా తగ్గించాలా? అన్నది డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి గంటా ఇరవై నిమిషాలు అంటే కాస్త ఎక్కువే. అందులో అయిదు, పది నిమషాలు తగ్గితే మంచిది అని యూజువల్ గా సినిమా జనాలు అంటారు. మరి సాహో మేకర్లు ఏం చేస్తారో చూడాలి. 
 
నిర్మాతల్లో ఒకరైన వంశీ, దర్శకుడు సుజిత్ తో కలిసి చెన్నయ్ లోనే వుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం సూపర్ వైజ్ చేసుకుంటున్నారు. హీరో ప్రభాస్, కొరియాగ్రాఫర్, వగైరా టీమ్ తో వెళ్లి సాంగ్స్ ఫినిష్ చేసారు. విజువల్ ఎఫెక్ట్ వర్క్ లు దాదాపు పూర్తి అయిపోయినట్లేనని లేటెస్ట్ న్యూస్. ఇక రీసెంట్‌గా ఈ సినిమానుండి రిలీజైన సాంగ్ ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: