జూలై, ఆగస్టు నెల టాలీవుడ్ హీరోలందరికీ పరీక్షకాలంగా వుంది. పోస్ట్ సమ్మర్ లో విడుదలయ్యే సినిమాలు అన్నీ హీరోలకు లైఫ్ అండ్ డెత్ అన్న రేంజ్ లో వుంది పరిస్థితి. అంతేకాదు నిర్మాతలు, దర్శకులకు కూడా ఈ సినిమాలు పరీక్షలు గానే కనిపిస్తున్నాయి. దాదాపు ఆరేడు సినిమాలు విడుదులవుతున్నాయి. అన్ని సినిమాలు కూడా హీరోలకు, దర్శకులకు పరీక్షలు పెట్టే సినిమాలే. జూలై 12న సందీప్ కిషన్ 'నిను వీడను నీడను నేనే' సినిమా విడుదలవుతోంది. సందీప్ కిషన్ స్వంతంగా నిర్మించిన సినిమా. విపరీతమైన టెన్షన్ తో వుంది సందీప్ భవిష్యత్. ఈ సినిమా కాస్త ఫరావలేదు అనిపించుకుంటేనే సందీప్ అడుగు ముందుకు పడుతుంది. సందీప్ ఈ సినిమాకు కేవలం హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా.

అదేరోజున ఆనంద్ దేవరకొండ డెబ్యూ సినిమా దొరసాని విడుదలవుతోంది. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వస్తున్నాడు ఆనంద్. ఈ సినిమా హిట్ కాకపోతే అతనికి సినిమా కెరీర్ ఇక్కడే ఆగిపోయే ప్రమాదం వుంది. ఇదే సినిమాకు నిర్మాత మధుర శ్రీధర్ ఎన్నో ఇబ్బందులు పడి సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా అయినా సక్సస్ అయితే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటాడు లేదంటే అంతే. దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న రాజ్ దూత్ సినిమా 12నే విడుదలకు రెడీ అవుతోంది. శ్రీహరి, డిస్కోశాంతిల నట వారసుడిగా ఈ సినిమాను గట్టెక్కించుకుంటేనే మేఘాంశ్ ముందుకు సాగుతాడు. లేదంటే మళ్ళీ పరీక్ష ఉంటుందో లేదో తెలీదు. 

ఈనెల 18న వస్తోంది ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్ కు సినిమా సక్సస్ చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయి తీరాలి. ఇదే సినిమాకు నిర్మాత, దర్శకుడు పూరి జగన్నథ్. అలాగే చార్మి కూడా నిర్మాతే. టెంపర్ తరువాత హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు పూరి. ఈ సినిమా హిట్ కాకపోతే చాలా కష్టం. డైరక్టర్ గానే కాదు, నిర్మాతలుగా పూరి, చార్మిలకు ఇంకా ఎక్కువ కష్టం. ఇప్పటికే చాలా నష్టాలు చూసాడు పూరి. ఈ హిట్ అయితేనే మరో సినిమా లేదు అంటే ఇక పూరి తన సినిమాలకు ఫుల్ స్టాప్. 

ఈనెల 25న డియర్ కామ్రేడ్ విడుదలవుతోంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ హోదాకు చేరిపోతాడు. టాప్ హీరోల సరసకు చేరుకుంటాడు. అది జరగాలంటే డియర్ కామ్రేడ్ హిట్ కావాల్సిందే. ఆగస్టు 2న బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' వస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్థితి ఏమిటన్నది జనాలకు తెలియంది కాదు. రాక్షసుడు సినిమా కాస్త బెటర్ అనిపించుకుంటేనే బెల్లంకొండ శ్రీనివాస్ అడుగు ముందుకు పడుతుంది. ఆగస్టు 2 రావడానికి అవకాశం వున్న మరో సినిమా రణరంగం. ఈ సినిమా హీరో శర్వానంద్, డైరక్టర్ సుధీర్ వర్మ.. ఇద్దరికీ పరీక్షనే. శర్వానంద్ సరైన హిట్ కోసం చూస్తున్నాడు. సుధీర్ వర్మ అయితే సరేసరి. ఈ సినిమా పాసైతేనే సుధీర్ వర్మకు మరో సినిమా. లేదంటే ఇక ఇంట్లో కథలు రాసుకోవాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: