హలో జబర్దస్త్ అనసూయ!! పద్దతి.. పద్ధతి.. 37 ఏళ్లు వచ్చి మీద పడ్డాయి. ఇద్దరు పిల్లలకు తల్లివి అయ్యావు.. బుల్లితెరపై యాంకర్‌గా.. వెండితెరపై నటిగా మంచి క్రేజ్ సంపాదించి సెలబ్రిటీ అయ్యావు. కాస్త పద్దతి పాటించకపోతే ఎలా? అంటూ నెటిజన్లు భగ్గుమనే అవకాశం కల్పించింది యాంకర్ అనసూయ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనసూయ.. ‘తానా’ సభలు సందర్భంగా యుఎస్ నగర వీధులను చుట్టొచ్చింది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికా అందాలను వీక్షిస్తున్న అనసూయ.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఆనందం పంచుకుంది. 


అసలే అనసూయ.. ఆపై అమెరికా వెళ్లింది.. ఇంకేం ఉంది.. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది. జబర్దస్త్ స్టేజ్ మీదే పొట్టి పొట్టి బట్టలతో రచ్చ చేసి హాట్ యాంకర్ అనిపించుకున్న ఈ సీనియర్ బ్యూటీకి అమెరికా గాలి తగిలేటప్పటికి మరింత హాట్ అవతారం ఎత్తింది. ఇటీవల అమెరికా వీధుల్లో పొట్టి నిక్కరుతూ విహరిస్తూ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడే ఆమె ఫాలోవర్స్ ఆహా.. ఓహో.. రంగమ్మత్త బుల్లి నిక్కరులో భలే ఉందే అని తెగ కామెంట్స్ చేశారు. ఇక న్యూ జెర్సీలోని ఆల్‌స్టీడ్స్ ఫామ్స్‌లోని పళ్ల తోటలోకి భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లి.. అక్కడ రకరకాల పండ్లను కోస్తూ కెమెరాకు పోజులు ఇచ్చింది. పళ్లతోటలో కలియతిరుగుతూ విదేశీ ఫలాలను కోస్తూ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసింది. 


అంతవరకూ బాగానే ఉంది కాని.. భర్తతో పాటు.. పిల్లలిద్దరికీ నిండైన వస్త్రాలను వేసిన అనసూయ తను మాత్రం బుల్లి నిక్కరుతో తొడలు మొత్తం కనిపించేలా పండ్లతోటలో థైస్ షో చేసింది. ఈ ఫొటోలను ఎప్పటిలాగే తన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో ‘లుక్కింగ్ బ్యూటిఫుల్ రంగమ్మత్త’ అనే పొగడ్తలతో పాటు.. పండ్ల తోటలో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అనసూయ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: