టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'.  ఈ సినిమా అందాల తార ఛార్మీ నిర్మిస్తుంది.  కొంత కాలంగా దర్శకులు పూరి, హీరో రామ్ ఒక్క హిట్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కొడితే ఏనుగు కుంభ స్థలం కొట్టాలనే ఉద్దేశ్యంతో ఫుల్ లెన్స్ మాస్ మూవీతో పూరి కథ, డైలాగ్స్ తాను ప్రిపేర్ చేసుకున్నాడట.

అందుకోసం మంచి ఎనర్జిటిక్ హీరో ఎవరా అని చూస్తే రామ్ కనిపించాడట..అంతే రామ్ కి కథ చెప్పడం ఆయన ఓకే అనడం సినిమా మొదలు పెట్టడం పూర్తి చేయడం కూడా అయ్యింది.  ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ రోజు మరో ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.  తాజాగా ఈ ట్రైలర్ మరీ ఊరమాస్ గా ఉండటం..రొమాంటిక్ టచ్ ఇవ్వడంతో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ ట్రైలర్ పై సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ స్పందించారు.


 ''పూరి ఈజ్ బ్యాక్.. తన మార్క్ మాస్ మసాలా టేకింగ్, పంచ్ డైలాగ్స్ తో ఇస్మార్ట్ శంకర్ తీశాడు. రామ్ ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్ చాలా హాట్ గా కనిపిస్తోంది. ఛార్మి మేం తొలిరోజు తొలిఆటకు సిద్ధమవుతున్నాం'' అంటూ ట్వీట్ చేశారు.   దానికి వెంటనే పూరి జగన్నాధ్ స్పందించి..థ్యాంక్స్ చెప్పారు.

అయితే ఈ ట్వీట్ కి ఛార్మీ స్పందిస్తూ.. ఇస్మార్ట్ శంకర్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా  అంటే దానికి వర్మ.. 'అయితే పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా' అంటూ బదులిచ్చాడు. దీనికి ఛార్మి.. 'వోడ్కాతో పాటు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ కాపీ తీసుకొని మీ దగ్గరకి వస్తున్నాను. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం' అంటూ ట్వీట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: