‘ఎక్కడ నుండో వచ్చి.. మా తెలుగు హీరోయిన్స్‌కి అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా.. మాపై కూతలు కూస్తే తాట తీస్తాం బిడ్డా’.. అంటూ గతంలో స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి సంచలనం రేపిన శ్రీరెడ్డి మరోమారు.. తన నోటి దురుసును సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కింది. 


టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో రకుల్ ప్రీత్‌పై అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. దీనికి కారణం శ్రీరెడ్డి కేవలం పబ్లిసిటీ కోసం ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పరోక్షంగా తప్పుబట్టారు రకుల్.. దీంతో అప్పట్లోనే రకుల్‌పై మండి పడింది శ్రీరెడ్డి. 


రకుల్ ప్రీత్, చెత్తగా మాట్లాడవద్దు.. నిన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తారు.. కానీ కాస్టింగ్ కౌచ్ గురించి మేము మాట్లాడింది అబద్దమని పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చెయ్యకు.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే నీకు, మా లాంటి వాళ్ల బాధ నీకేం తెలుసు.. నీ లాంటి వాళ్లను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంచకూడదనే మా ప్రయత్నం. ‘కోట్లు ఇస్తుంటే పాపం తెలుగు ఇండస్ట్రీ గొప్ప అనకపోతే ఏం చెప్తావులే.. అంతేకాదు జిమ్‌లు పెట్టి వ్యాపారం కూడా చేస్తున్నావు, ఇదంతా తెలుగు ప్రేక్షకుల డబ్బు.. అప్పనంగా తింటున్నావు.. ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూసే వందలాది మంది కార్మికులు ఉన్నారు.. గుర్తించుకో ఎక్కువ మాట్లాడితే, తెలుగోళ్లం తాట తీస్తాం.. ఖబడ్దార్ బిడ్డా’ అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. 


ఇక తాజాగా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ ఆమె బాడీ షేమింగ్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ‘నిమ్మకాయలకి పాడింగ్ పెట్టి రకుల్ ప్రీత్ లాంటి వాళ్లు మోసం చేస్తే పిచ్చి కొడుకులకి జొల్లు, నేను ఏం పెట్టకుండా ఒరిజిన్‌గా చూపిస్తే కుళ్లు’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. 
శ్రీరెడ్డి దృష్టిలో తనకు జరిగింది అన్యాయమే కావచ్చు.. దానికి రకుల్ కూడా కారణం అయి ఉండవచ్చు. అయితే విజ్ఞత మరిచి సాటి ఆడదని కూడా చూడకుండా ఆమె శరీరభాగాలపై పబ్లిక్‌గా పోస్ట్ పెట్టడం సరైన పద్దతి కాదంటూ రకుల్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: