నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. ఆ తరువాత ఈ హీరోయిన్ ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఆ మూవీలో డీసెంట్ గా కనిపించింది. ఇప్పుడు పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.
ఇందులో నభా నటేష్ తెలంగాణా అమ్మాయిలా, ట్రెండీగా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం తెలంగాణ భాషని నేర్చుకుందట. తెలుగు నేర్చుకున్నా, డబ్బింగ్ చెప్పడానికి సరిపోదు. అందుకే ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పలేకపోయిందట. పూరి సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరిని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
నభా నటేష్ విషయంలో కూడా అదే జరిగింది. పూరితో సినిమా చేయడం ఒక వరం అని చెప్పింది. నిధి తో కలిసి నటించే సన్నివేశం ఒక్కటి కూడా లేదట. కాకపోతే ఇద్దరు కలిసి ఓ సాంగ్ లో డ్యాన్స్ చేస్తారు. అంతకు మించి ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పింది.
నభా రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మీడియాకు చెప్పింది. ‘‘నిజ జీవితంలోనూ నేను అల్లరి పిల్లనే. కాలేజీలో నా అల్లరికి తట్టుకోలేక మా నాన్నగారికి నామీద ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం రవితేజతో ‘డిస్కోరాజా’లో నటిస్తున్నాను. ఇంకో రెండు పెద్ద సంస్థలు తీసే తెలుగు చిత్రాల్లో నటించేందుకు చర్చలు సాగుతున్నాయి. తమిళంలో ఒక చిత్రంలో నటించే అవకాశం ఉంది’’ అని చెప్పుకొచ్చింది నభా నటేష్.