కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకొచ్చి పదేళ్లు దాటిపోయినా ఇంకా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఈ మధ్య సరైనా హిట్స్ లేక అవకాశాలు తగ్గాయి. అయితే దర్శకుడు ఓంకార్ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘రాజుగారి గది 3' ఇటీవల పూజ కార్యక్రమాలతో అధికారికంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకున్నారు.


షూటింగ్ మొదలుపెట్టాలి అనుకుంటున్న సమయంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక చిత్ర యూనిట్ తాప్సిని ఫైనల్ చేసినట్లు మరో టాక్ వచ్చింది. కానీ, ఆమె కూడా చేయననడంతో కాజల్ పేరు తెరపైకి వచ్చింది. అనుకున్న ఇద్దరు హీరోయిన్లు హ్యాండ్ ఇవ్వడంతో ‘రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు చేయడానికి ముందు ఓకే చెప్పిందట కాజల్.


అయితే, అందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో షాకైన ఓంకార్ చేసేదేం లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి' తర్వాత కాజల్‌కు హిట్ లేదు. ఆ తర్వాత ఆమె చేసిన ‘కవచం', ‘సీత' సినిమాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. దీంతో ఇక కాజల్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె మాత్రం వచ్చిన అవకాశాన్ని ఇలా వదులుకోవడం చర్చనీయాంశం అవుతోంది. కాజల్ వ్యవహరిస్తున్న తీరుకు టాలీవుడ్ షాక్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: