రష్మిక మందన... ఈ పేరు ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన ఈ భామ దానికంటే ముంది `కిరాక్ పార్టీ` సినిమాతో కన్నడనాట మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాతో ఆరంభంలోనే ఘనవిజయాన్ని అందుకుంది. ఆ తర్వాత `గీతగోవిందం` సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఛలో గీత సినిమాతో తెలుగులో విడుదలైన అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
గీతా గోవిందంలో మంచి విజయాన్ని సాధించిన రష్మిక, విజయ్ దేవరకొండ మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంతో తెరపైకి రానున్నారు. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ కిరాక్ పార్టీ సినిమా షూటింగ్ సమయంలోనే నటుడు రక్షిత్తో రష్మిక ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు విడిపోయారు. ప్రస్తుతం ఎవరి పనులతో వారు బిజీ అయిపోయారు.
అయితే వీరి బ్రేకప్ గురించి అవకాశం దొరికినప్పుడల్లా రష్మికకు ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన `డియర్ కామ్రేడ్` సినిమా ప్రమోషన్ కోసం రష్మిక తాజాగా బెంగళూరు వెళ్లింది. అక్కడ రక్షిత్తో బ్రేకప్ గురించి మీడియా మరోసారి రష్మికను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మొదట విజయ్ స్పందించాడు.
మీరు `సినిమా గురించి మాట్లాడండి. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మరొకరికి అనవసరం. మీరు పదే పదే అడగడం.. మేం చెప్పడం.. ఇదంతా అనవసరం. ఇది మన పనికాదు` అని విజయ్ అన్నాడు. అనంతరం రష్మిక స్పందిస్తూ.. `ఈ ప్రశ్న నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా.. అందుకే జవాబు చెప్పలేకపోతున్నాన`ని బదులిచ్చింది.