నాగార్జున కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు.  క్లాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  మాస్ కు నచ్చే సినిమాలు అడపాదడపా చేసినా.. ఎక్కువశాతం క్లాస్ హీరోగానే పేరు తెచ్చుకున్నాడు.  ఇప్పటికీ ఇంకా హీరోగా చేస్తున్నాడు.  ఇప్పుడు నాగార్జున కొడుకులు చైతన్య, అఖిల్ లు కూడా సినిమా రంగంలో ఉన్నారు.  


చైతూ హీరోగా స్టాండ్ అయ్యాడు.  అయితే, సరైన హిట్ దొరకడం లేదు.  మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటేనే.. టాప్ ప్లేస్ కు వెళ్లేందుకు అవకాశం దొరుకుతుంది.  అఖిల్ మూడు సినిమాలు చేసినా మూడు పరాజయం పాలయ్యాయి.  ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.  


సినిమా షూటింగ్ విషయంలో నాగార్జున ఇద్దరు కొడుకులను పిలిచి మందలించినట్టు తెలుస్తోంది.  షూటింగ్ సమయం కంటే ఓ అరగంట ముందుగానే సెట్స్ లో ఉండాలని, అప్పుడే ఆరోజు చేయబోయే సీన్ గురించిన విషయాల గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది.  ఫలితంగా సీన్ బాగా వస్తుంది.  అలా కాకుండా ఫలానా సమయం అంటే ఆ టైమ్ కి వెళ్లి డైరెక్ట్ గా సీన్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.  సీన్ కు ముందు రిహార్సిల్ తప్పని సరి అని మందలించారట.  


ఈ విషయంలో సమంతను చూసి నేర్చుకోమని చెప్పినట్టు తెలుస్తోంది.  సమంత సమయానికి కంటే ముందుగానే షూటింగ్ కు వెళ్తుంది.  సెట్స్ లో తన పాత్రకు సంబంధించిన సీన్ ను క్షుణ్ణంగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి సీన్ పై పట్టు సాధింస్తోంది.  అందుకే తన సినిమాలు హిట్ అవుతున్నాయి.  నటిగా మంచి పేరు తెచ్చుకుంటోంది అని చెప్పి క్లాస్ ఇచ్చారట.  మరి ఈ మాటలను ఇద్దరు కొడుకులు ఎంతవరకు చెవికేసుకుంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: